వరద గుప్పిట్లో పలు గ్రామాలు
కర్నూలు : రాష్ట్రాన్ని జల ప్రళయం ముంచెత్తుతోంది. వరద గుప్పిట్లో పలు గ్రామాలు చిక్కుకున్నాయి. కర్నూలు, మహాబూబ్ నగర్ జిల్లాలు పరిస్థితి భీభత్సంగా ఉంది. సుమారు 100 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయాని అధికారులు అంచనా వేస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తుంగభద్రానది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరీవాహక గ్రామాల్లో తుంగభద్ర ప్రవహిస్తోంది. వేలాది మంది ప్రజలు ఇళ్ళ మిద్దెలపైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బిక్కు.. బిక్కుమంటున్నారు. పిల్లలు ఆకలకి తట్టుకోలేక అలమటిస్తున్నారు. మమ్ములను ఆదుకోండి అంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు.
News Posted: 2 October, 2009
|