కర్నూలు : వరద బీభత్సంతో పాలమూరు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అలంపూర్లో వరద నీటిలో శవాలు తేలుతున్నాయి. ఇప్పటికే ఏడు మృతదేహాలు బయటపడ్డాయి. మరి కొన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నీరు తగ్గిన ప్రాంతాల్లో ఒండ్రుమట్టి పేరుకుపోవడంతో బాధితులు ఇక్కట్ల పాలవుతున్నారు. అలంపూర్ లో నీరు తగ్గేందుకు ఇంకా కొన్ని రోజులు పట్టవచ్చని బాధితులు వాపోతున్నారు. ఇళ్ళల్లో చేరిన మట్టిని ఎవరికి వారే తొలగించుకుంటున్నారు.