నెల్లూరు : జిల్లాలో ఈ రోజు జరిగిన ఘర్షణలో 17 మంది గాయపడ్డారు. మనుబోలు మండలం గొట్లపాలెంలో బుధవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వారందరూ గాయపడ్డారు.వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.