భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
అనంతపురం : కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాల్వాయ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భర్తను ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటనకు కుటుంబ కలహాలే కారణమని ఇరుగు పొరుగువారు అభిప్రాయపడుతున్నారు.
News Posted: 27 October, 2009
|