చంద్రబాబు రాక
కరీంనగర్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. జిల్లాలో డెంగీ, వైరల్ జ్వరాలు ప్రబలడంతో సుమారు 70 మంది పైగా మృత్యువాత పడ్డారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, విజయరమణారావు తో పాటు పార్టీ ముఖ్యులు అధినేత దృష్టికి తీసుకువెళ్ళడంతో చంద్రబాబు ఈ జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆడంబరాలు చేయవద్దని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ శ్రేణులను కోరారు.
News Posted: 27 October, 2009
|