శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ఏలూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజు దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు దేవస్థానం వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు పండితుల వేద ఆశీర్వచనాలు అందచేసి శ్రీవారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా జడ్జి టి.భక్తవత్సలం, మెజిస్ట్రేట్ మురళీకృష్ణ, న్యాయవాదులు టివి కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.
News Posted: 27 October, 2009
|