ఏలూరు : పశ్చిమ గోదవారి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవిరావు శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటనను గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు కృత్రిమ శ్వాస అందిస్తున్నరు. కాగా కలెక్టర్ చిరంజీవిరావు ఆత్మహత్యాయత్నానికి గల కారణం తెలియరాలేదు.