అస్వస్థతకు గురైన మేయర్
కాకినాడ : నగర పాలక సమావేశంలో సమస్యలపై చర్చలు జరుపుతుండగా నగర మేయర్ కవికొండల సరోజ తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. కార్తీకమాసంలో ఉపవాసం ఉండటం, లోబీపీ కారణంగా ఆమె అస్వస్థతకు గురై ఉండవచ్చని ఆమె సన్నిహితులు తెలిపారు. మేయర్ అస్వస్థతకు గురవ్వడంతో ఈ సమావేశాన్ని నగరపాలక అధికారులు రద్దు చేశారు.
News Posted: 7 November, 2009
|