నిజామాబాద్ : ఇంటర్ చదువుతున్న విద్యార్థి మనస్తాపానికి గురై సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి విజ్ఞాన్ జూనియర్ కళాశాలో చదువుతున్న అరవింద్ ట్యూబ్ లైట్ పగులగొట్టాడని నుంచి కాలేజీ యాజమాన్యం 500 రూపాయలు చెల్లించాలని అన్నారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యాయత్నతానికి పాల్పడినట్లు సమాచారం. కానీ తల్లితండ్రులు మాత్రం యాజమాన్యం వేధింపులు తట్టుకోలేకే తమ కుమారుడు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు.