పుట్టపర్తిలో శ్రీవారి దివ్యక్షేత్రం
అనంతపురం : సత్యసాయి సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి సమీపంలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రాన్ని త్వరలో నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ డికె ఆదికేశవుల నాయుడు తెలిపారు. బుధవారం ఆయన పుట్టపర్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సాయి శ్రీనివాస విడిది గృహంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దివ్యక్షేత్ర నిర్మాణానికి అన్ని సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ దివ్యక్షేత్రంలో దేవాలయం నిర్మాణం, వంటగదులు, విడిది సత్రాలు, ధర్మప్రచార పరిషత్ క్షేత్రంలో అందులో రూపొందించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. ఆదికేశవులు నాయుడుతో పాటు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షులు చేతన్ దేశాయ్ లు సత్యసాయిని దర్శించుకున్నారు.
News Posted: 12 November, 2009
|