రాజమండ్రికి అర్బన్ హోదా
రాజమండ్రి : శాంతిభద్రతలను కట్టుదిట్టంగా అమలు చేసే కృషిలో భాగంగా ఒకటి రెండు వారాల్లో రాజమండ్రికి పోలీస్ అర్బన్ జిల్లా హోదా లభించనుంది. ఈ మేరకు మౌళిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం వంటివాటిపై కసరత్తు ప్రారంభమైంది. అర్బన్ జిల్లా హోదా వచ్చిన తర్వాత ఇక్కడ ఐపీఎస్ అధికారిని కమిషనర్ గా నియమిస్తారు. పాలనా సౌలభ్యం కోసం మరో ఇద్దరు డీఎస్పీ హోదా కలిగిన వారిని అడిషనల్ కమిషనర్లుగా నియమిస్తారు. రాజమండ్రి సబ్ డివిజన్ పరిధిలో ప్రస్తుతం 500 మంది కానిస్టేబుళ్ళు ఉన్నారు. అర్బన్ హోదా వస్తే వీరి సంఖ్య 1500లకు పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం హైదరాబాద్ లో డీఐజీ కార్యాలయంలో దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
News Posted: 12 November, 2009
|