రాజమండ్రి : పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు బుధవారం కిడ్నాప్కు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఎట్టిపాడులో పాఠశాలకు వెళ్ళిన ఇద్దరు విద్యార్థులు అపహరణకు గురికావడంతో వారి తల్లి తండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.