రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం - జొన్నాడ సమీపంలో ఓ ఇసుక లారీ వంతెన పై నుండి గోదావరిలోకి ఒరిగిపోయింది. దీంతో ఒకరు మృతి చెందారు. గోదావరిలోకి పడిన లారీ పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది. సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.