యూత్ క్రిస్మస్ వేడుకలు
రాజమండ్రి : రాజమండ్రి క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ (ఆర్ సీవై) ఆధ్వర్యంలో స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన యూత్ క్రిస్మస్ వేడుకలు ఆహుతులను ఆక్టటుకున్నాయి. ఆర్ సీ వై ఏ బృందం వారు క్రీస్తు పుట్టుకను సూచిస్తూ పాడిన పాటలు అందరినీ అలరించాయి. పాస్టర్లు రెవరెండ్ జీడీ నెల్సన్ బాబు బైబిల్ ప్రవచం చేశారు. క్రీస్తు పుట్టుకకు సంబంధించిన చిన్నారుల ప్రదర్శన ఆకట్టుకుంది. మధ్యమధ్యలో శాంతా క్లాజ్ లు వచ్చి చిన్నారులను పలకరిస్తూ చాక్లెట్లు, బెలూన్లు ఇస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, జెమిని టెక్నో మార్కెటింగ్ ప్రైవేటు లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.వి.ఎస్.జ్యోతిబాబు తదితరులు సందేశాలు ఇచ్చారు.
News Posted: 8 December, 2009
|