'యోగా చేయడం గొప్ప అనుభూతి'
కడప : పచ్చని ప్రకృతి మధ్య యోగా చేయడం వల్ల మానసికోల్లాసం, ప్రశాంతత కలుగుతుందని, ఈ ప్రక్రియ వల్ల అవరోధాలను నిరోధించి సత్ఫలితాలను సాధించవచ్చని మిత్రా హోలిస్టిక్ హెల్త్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రంగనాథరెడ్డి పేర్కొన్నారు. రాజంపేటకు 20 కిలోమీటర్ల దూరంలో నున్న రెడ్ వుడ్ జంగిల్ సఫారిలో మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో యోగా సాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా సాధనతో పాటు అప్పుడప్పుడు ప్రకృతి వనాల్లో వన భోజనాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆథ్యాత్మిక ఫలితాలకు తోడుగా సామాజిక ఏకత్వాన్ని, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందన్నారు.
News Posted: 8 December, 2009
|