12న రుణ మేళా
కర్నూలు : వరదల్లో నష్టపోయిన చిన్న వ్యాపారులకు అన్ని బ్యాంకులు చేయూతనివ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీకాంతం బ్యాంకర్లను కోరారు. ఈ నెల 12న అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించే రుణమేళాలో రుణ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన చిన్న వ్యాపారులందరికీ రుణాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఆయన పిలుపు మేరకు వరదల్లో నష్టపోయిన చిరు వ్యాపారులకు రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకర్లు సహకరిస్తామని చెప్పడంతో 12న 10వేల మందికి రుణాలు పంపీణీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో తెలిపారు. సోమవారం తన చాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఎల్ డీఎం సుబ్రమణ్యం, ఎస్ బీఐ సీనియర్ మేనేజర్ రహిం, పలు బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
News Posted: 8 December, 2009
|