ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా నిడుదవోలు మండలం కోరుమామిడి వద్ద తాడిపూడి ప్రధాన కాలువకు గండి పడింది. దీంతో నీరు పంట పొలాలను ముంచెత్తుతోంది. ఈ సంగతి తెలుసుకున్న గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు.