వినూత్న నిరసనలు
నెల్లూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు జిల్లాలో వినూత్న ప్రదర్శనలు సాగుతున్నాయి. రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, ఆర్టీసీ బస్సులు నిలివేత వంటి నిరసన కార్యక్రమాలతో జిల్లా దద్దరిల్లిపోతోంది. కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు ఉద్యమాలు నిర్వహిస్తుండగా, ప్రజారాజ్యం కూడా సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతోంది. న్యాయవాదులు, విద్యార్థి సంఘాల దీక్షలతో జిల్లా అట్టుడికిపోతోంది. ఆర్టీసీ బస్సులు స్వచ్చందంగా బంద్ ను కొనసాగిస్తున్నాయి.
News Posted: 18 December, 2009
|