20న చిరు పర్యటన
కాకినాడ : ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈనెల 20వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకోవడానికి ఆయన ఈ పర్యటన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 20వ తేదీ ఉదయం తుని నుంచి అన్నవరం చేరుకొని శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటారు. తదుపరి కత్తిపూడి చేరుకుంటారు. అక్కడి నుండి గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, రాజానగరం మీదుగా రాజమండ్రి చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు. 21వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
News Posted: 18 December, 2009
|