30 యాక్టు అమలు
నెల్లూరు : సమైక్యాంధ్ర బంద్ కు పిలుపునివ్వడంతో పోలీసులు జిల్లాలో 30 యాక్టును అమలు చేసారు. బంద్ కారణంగా నగరంలో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు. ఉద్యమంలో బాగంగా ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా పోలీసులు ఆదేశాలు జారీ చేసారు. తమ ఆదేశాలను ధిక్కరించి నిరసన ప్రదర్శన చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మల్లారెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవైటు ఆస్తులకు నష్టం కలిగిస్తే అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని ఆయన హెచ్చరించారు.
News Posted: 4 January, 2010
|