కరీంనగర్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఏబీవీపీ సత్యాగ్రహ ఉద్యమం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని బోయినపల్లి వెంకట రామారావు ప్రారంభించారు. ప్రత్యక రాష్ట్రం కోసం విద్యార్ధులు సత్యగ్రహానికి దిగడం అభినందనీయమని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేసారు.