కరీంనగర్ : ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీలో ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పటికీ 14 నెలలు పాటు అదనంగా విధులు నిర్వర్తించాడు. అయితే ఈ విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించడంతో ఆయన్ను విధుల నుండి తొలగించారు. కంప్యూటర్ పరిజ్జ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా నవరత్న హోదా కలిగన సంస్థలో ఇలాంటి పొరపాటు జరగడంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.