గుంటూరు : నాగార్జున విశ్వవిద్యాలయంలోని దూరవిద్య కేంద్రానికి ఢిల్లీలోని దూర విద్య మండలి (డెక్) 15 లక్షల రూపాయలను మంజూరు చేసింది. వర్శిటీలో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు ఈ నిధులు వినియెగించాల్సి ఉంటుందని వైస్ ఛాన్సలర్ హరగోపాల రెడ్డి వెల్లడించారు. దూరవిద్యా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని కోరగా డెక్ ఈ మేరకు నిధులు విడుదల చేసిందని ఆయన చెప్పారు.