కడప : ప్రైవేటు సెల్ ఫోన్ ఆపరేటర్లను ఎదుర్కొనేందుకు బీఎస్ ఎన్ ఎల్ మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నూతన పథకాన్ని సోమవారం ఆ సంస్థ జనరల్ మేనేజర్ ఎన్ బాలచంద్రన్ వెల్లడించారు. వినియోగదారులకు పలు ప్రయోజనాలు అందించే ఈ పథకం కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కాల్ సెంటర్ ఫోన్ చేస్తే తమ సిబ్బంది డోర్ సర్వీస్ అందిస్తారని ఆయన వివరించారు.