పర్యాటక వసతి గృహం
కర్నూలు : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది క్షేత్రాల్లో పర్యాటక వసతి గృహాలు నిర్మాణం చేస్తున్నట్లు టూరిజం శాఖ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వెంకట రమణా రెడ్డి వెల్లడించారు. సుమారు 2.90 లక్షల రూపాయల వ్యయంతో ఈ వసతి గృహాలు నిర్మాణం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీశైలంలో 1.60 లక్షల రూపాయలతో 42 గదులను, మహానందిలో1.30 లక్షల రూపాయల వ్యయంతో28 గదులు, రెండు డార్మెటరీ భవనాలు నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు.
News Posted: 18 January, 2010
|