కర్నూలు : కడప పార్లమెంట్ సభ్యడు వై ఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష చేసారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు.నియోజకవర్గంలో అమలు జరుగుతున్న అభివృద్ది పనుల అమలుపై ఆరా తీసారు. అలాగే మరిన్ని పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. అనంతరం జగన్ కడప నియోజకవర్గంపై కూడా సమీక్ష చేసారు.