పత్తికొండ పోస్టాఫీసు ప్రగతి
కర్నూలు : ప్రాజెక్టు యారో ఆమలులలో జిల్లాలోని పత్తికొండ పోస్టాఫీసుకు దేశంలో ద్వితీయ స్థానం లభించింది. పోస్టల్ వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నందుకు గాను ఈ పురస్కారం దక్కిందని డైరక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ వి రాములు చెప్పారు. పోస్టల్ జీవిత భీమా, గ్రామీణ పోస్టల్ జీవిత భీమా వంటి పథకాలను అమలు చేయడంలో పత్తికొండ పోస్టాఫీసు విశేషమైన ప్రగతి సాధించిందని ఆయన కొనియాడారు.
News Posted: 26 January, 2010
|