జాతరలో రాజమండ్రి కార్మికులు
మేడారం : రెండేళ్ళకు ఓ సారి వైభవంగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి వచ్చిన పారిశుధ్య కార్మికులు సేవలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. జాతర సందర్భంగా మేడారంలో పేరుకుపోతున్న చెత్తను వారు ఎప్పటికప్పుడే పరిశుభ్రం చేస్తున్నారు. తద్వారా భక్తుల్లో కూడా పరిశుభ్రత ఒక అలవాటు, సాంప్రదాయంగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల సమన్వయ సహకారాలతో ఈ పారిశుధ్యం పనులు జరుగుతున్నాయి.
జాతరను 30 సెక్టార్లుగా విభజించి మొత్తం 900 మంది కార్మికులు పారిశుధ్యం పనిలో నిమగ్నమయ్యారు. వీరిలో ఎక్కువ భాగం అంటే 600 మంది రాజమండ్రి నుంచి వచ్చినవారు పారిశుధ్యం పనిలో తమ నైపుణ్యాన్ని, నిబద్ధతను ప్రదర్శిస్తున్నారు. గద్దెల వద్ద జాతర మొక్కులలో భాగంగా అశేష భక్తులు వేసి టెంకాయలతో నిండే సంచులు, బంగారం (బెల్లం) తదితరాలను ఎప్పటికప్పుడు వేరుచేసి వాటిని అక్కడి నుంచి తరలిస్తూ భక్తుల చేత ఔరా అనిపించుకుంటున్నారు.
News Posted: 28 January, 2010
|