శ్రీవారి సేవలో లతా దీదీ
తిరుపతి : ప్రసిద్ధ సినీ నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ శుక్రవారం రాత్రి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. తాను స్వయంగా స్వరపరిచిన అన్నమయ్య కీర్తనల సిడిని లతా మంగేష్కర్ స్వామివారికి ఆమె సమర్పించారు. వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం లతా మంగేష్కర్ శుక్రవారం సాయంత్రానికే కుటుంబ సభ్యులతో సహా తిరుమల చేరుకున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన గానకోకిలను టిటిడి ఆలయం అధికారులు మహాద్వారం నుంచి అనుమతించారు. తిరుమలకు విచ్చేసిన లతామంగేష్కర్ తదితరులను టిటిడి పాలకమండలి చైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు, ఈఓ కృష్ణారావు పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానించారు.
News Posted: 29 January, 2010
|