తిరుమల : ప్రముఖ నేపధ్య గాయని లతా మంగేష్కర్ తిరమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మహాద్వారం నుండి అమెకు వెంకన్న దర్శనం లభించింది. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసారు. ఆమె స్వయంగా స్వర పరిచిన అన్నమయ్య కీర్తనల సీడీని లత స్వామి వారికి సమర్పించుకున్నారు.