నెల్లూరు : వివిధ ప్రభుత్వ పథకాల్లో భాగంగా మంజూరైన గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె రామే గోపాల్ అదికారులను ఆదేశించారు. ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఏప్రిల్ నెలాఖరు లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లు నిర్మాణాల్లో అవకతవకలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.