గుంటూరు : స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ముహూర్తం కుదిరింది. వచ్చే నెల 3న ఈ ఎన్నిక నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కమిటీ పదవీ కాలం ఈనెల 15తో ముగియనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అదే రోజున సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అయితే 21-30 వార్డు డివిజన్లకు సంబంధించి ప్రధానంగా పోరు సాగే అవకాశం ఉంది.