గుంటూరు : జిల్లాలోని పిడుగురాళ్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం తెల్లవారుజామున దుండగులు జానపాడులోని ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డారు. సుమారు 25 సవర్ల బంగారాన్ని దోచుకెళ్లారు. అడ్డువచ్చిన కుటుంబీకుల్ని చితకబాదారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.