కర్నూలు : కర్నూలు ఫ్యామిలీ కోర్టు జడ్జిపై ఓ మహిళ చెప్పు విసిరింది. నాలుగో అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి షణ్ముగంపై అదే కోర్టులో స్టెనోగా పనిచేస్తున్నరాధారాణి గురువారం చెప్పు విసిరి కొట్టింది. కోర్టు ప్రారంభం కాగానే రాధారాణి చెప్పులు వేసుకోని లోపలికి రావడంపై జడ్జి షణ్ముగం ఆమెను దుర్భాషలాడారు. వాటిని నెత్తిమీద పెట్టుకోమని అనటంతో ఆమా వాటిని జడ్జిపైకి విసిరింది. ఎన్నో రోజులుగా న్యాయమూర్తి తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆ తరువాత ఆమె కన్నీరు పెట్టుకుంది. దీనిపై వ్యాఖ్యానించేందుకు జడ్జి నిరాకరించారు.