హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి గురువారం ముఖ్యమంత్రి రోశయ్యను కలిసారు. అసెంబ్లీ హాల్లో వీరిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్టించవలసిందిగా ఆయన సీఎంను కోరారు. చిరంజీవి ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు.