విశాఖపట్నం : అప్పుడే పుట్టిన బిడ్డను కుక్క నోట కరచుకొని తీసుకుపోయిన ఉదందం శనివారం ఉదయం కింగ్ జార్జి ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కుక్క కరిచిపట్టి తీసుకువెళ్ళడంతో ఆ పసిబిడ్డ ప్రాణాలు వదిలేశాడు. అనూరాధ అనే మహిళ శుక్రవారం ఉదయం ఐదు గంటలకు కెజిహెచ్ లోని ప్రసూతి వార్డులో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను గైనిక్ వార్డులో ఉంచారు. శనివారం ఉదయాన్నే ఓ కుక్క గైనిక్ వార్డులోకి చొరబడి బిడ్డను నోట కరచుకొని పారిపోయింది. 24 గంటల క్రితమే ఈ భూమ్మీద పడిన తమ బిడ్డకు అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయని తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమని బాధితుల తరఫు బంధులు కెజిహెచ్ లో ఆందోళనకు దిగారు.