'మరో మూడు వేద పాఠశాలలు'
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతర్జాతీయ వేద సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు ఈ సమ్మేళనాన్ని ప్రారంభించారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతితో పాటుగా వివిధ దేశాల నుండి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదికేశవులు నాయుడు మాట్లాడుతూ, వేద సంపద పరిరక్షణకు టీటీడీ పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రాచీన సాహిత్య సంపదను, వేద రచనలు భవిష్యత్తు తరాలకు అందజేయడానికి టీటీడీ విశేష కృషి చేస్తుందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో మరో మూడు పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
News Posted: 4 March, 2010
|