విద్యార్థుల దుర్మరణం
విజయవాడ : కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద తొమ్మిదో నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం పాలయ్యారు. విజయవాడకు చెందిన ప్రదీప్, మధు అనే యువకులు స్నేహితులతో కలసి కంచికచర్లలో తాము చదువుతున్న మిగ్ ఇంజనీరింగ్ కాలేజీ వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ప్రదీప్, మధు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
News Posted: 6 March, 2010
|