'మిత్రుడు' రివ్యూ
పారిశ్రామిక వేత్త సాయికృష్ణ (రంగనాథ్) కుమార్తె ఇందు (ప్రియమణి). మలేసియాలో చదువుతుంటుంది. ఇందు పెళ్లి ఖాయం చేసేందుకు కారులో వెళ్తుండగా సాయికృష్ణకు ప్రమాదం జరుగుతుంది. తన వివాహ విషయంలో ఆటంకాలు ఎదురవుతుండటంతో ఇందు తన జాతకం చూపించుకుంటుంది. ఆమె జాతకంలో 'వైధవ్యం' ఉందని జ్యోతిష్యుడు చెబుతాడు. ఆ ప్రకారం జీవతమంటే ఆశలు, చావంటే భయంలేని సింహలగ్న జాతకుడిని ప్రేమించి పెళ్లాడితే అతను ఎలాగూ మృత్యువాత పడతాడనీ, ఆ తర్వాత తాను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ కావచ్చని ఇందు నిశ్చయించుకుంటుంది. అలంటి లక్షణాలన్నీ ఆదిత్య (బాలకృష్ణ)లో కనిపిస్తాయి. అక్కడ్నించీ అతని వెంటపడుతుంది. ప్రేమిస్తున్నాననీ...అతన్నే పెళ్లి చేసుకుంటాననీ చెబుతుంది. ఆదిత్య నిరాకరిస్తాడు. చివరకి ఇందు పట్టుదల చూసి పెళ్లికి సరేనంటాడు. ఇందు తన తల్లిందండ్రులకు చెప్పకుండానే మలేసియాలో ఆదిత్యతో మూడుముళ్లు వేయించుకుంటుంది. ఇందు ప్లాన్ ప్రకారం (జాతకం ప్రకరం) సరిగ్గా 30 రోజుల్లో ఆదిత్య మృత్యువాత పడాలి. ఎలాగూ అతనికి చావుతప్పదని అనుకున్న ఇందు తన బాయ్ ఫ్రెండ్ తో (అతన్నే ఇందు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది) కలిసి మలేసియా నుంచి ఇండియాకు విమానంలో బయలుదేరుతుంది. అక్కడ ఆదిత్య ప్రత్యక్షమవుతాడు. ఆమెతో కలిసే ఇండియాకు, అత్తవారింటికీ చేరుతాడు. ఇందు జీవితంలోకి ఆదిత్య ప్రవేశంచడం వెనుక ఏదైనా కారణముందా? ఆమెలో ఎలాంటి పరివర్తన కలిగించాడు? జాతకం నిజమైందా? లేదా...అనేది వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|