'వెంగమాంబ' రివ్యూ
భక్తిరస చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం ప్రాణం. ఎం.ఎం.కీరవాణి సంగీతం 'వెంగమాంబ' చిత్రానికి ఓ మణిహారం లాంటిదిగా చెప్పాలి. 'తిరుగొండ హారతి తిరమైన కీరితి..' అనే టైటిల్స్ సాంగ్ తో మొదలుపెట్టి 'ముత్యాల హారతి' వరకూ ప్రతి పాటనూ ఓ ఆణిముత్యంలా కంపోజ్ చేశారు. మేజువాణి, కోయగూడెం పాటల్లోనూ మెలోడీ, చక్కటి బీట్ తొంగిచూడటం విశేషం. 'అంబా...జగదాంబ' పాట, ఆ పాట చిత్రీకరణ సినిమాకే హైలైట్ గా చెప్పుకోవాలి. పద్మశ్రీ ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర, కీరవాణి నేపథ్యగానం అందించారు. దర్శకుడు ఉదయ్ భాస్కర్ అందించిన సంభాషణలు క్లుప్తంగా, లోతైన అర్ధంతో ఆకట్టుకుంటాయి. 'నేనే శాశ్వతం. నేను...నేను అన్న నేనులకు నైనై ఉన్నాను', 'సావిత్ర-సత్యవంతుడి చరిత్ర కథ కాదు. కాబట్టే అవి నేటికీ సజీవంగా నిలిచాయి' వంటి సంభాషణలు కొన్ని. పి.ఆర్.కె.రాజు సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, దొరస్వామి రాజు నిర్మాణ విలువల తగిన విధంగా ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం వెంగమాంబ జీవిత విశేషాలతో నడిస్తే ద్వితీయార్థంలో ఆమె సాగించిన రచనా వ్యాసంగం, శ్రీవారిని ప్రత్యక్షంగా సాక్షాత్మరించుకోవడం, ఆయనలో ఐక్యం చెందడం వంటి అంశాలతో నడుస్తుంది. పటిష్టమైన స్క్రిప్టు, కీరవాణి సంగీతం, మీనా నటన వంటివి 'వెంగమాంబ'ను జనరంజకం చేసే అవకాశాలున్నాయి. 'బోనాలు' సీజన్ కూడా కలిసొచ్చే ప్రధానాంశం. చర్విత చర్వణమే అయినా..చరిత్రను చదివే అవకాశం లేని వారు తప్పనిసరిగా ఎంతో కొంత తెలుసుకునే అవకాశాన్ని 'వెంగమాంబ'తో కలిగించిన నిర్మాత దొరస్వామి అభినందనీయుడు. అన్ని వయసుల వారూ చూడదగిన చిత్రమిది..
Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|