'కలవరమాయే మదిలో' రివ్యూ
'శంకరాభరణం', 'శృతిలయలు' వంటి సినిమాలు తీసే రోజులా ఇవి? కావనుకునే కళాతపస్వి కె.విశ్వనాథ్ కెమెరా వెనక్కి వెళ్లడం మానేశారు. 'రాధాగోపాళం', 'సుందరాకాండ' వంటి చేదు అనుభవాలు బాపూకి కూడా తప్పలేదు. విశ్వనాథ్ సినిమాలా తన తాజా చిత్రం ఉందని అనిపిస్తే అందుకు గర్విస్తానని దర్శకుడు సతీష్ కాసెట్టి ముందే చెప్పుకొచ్చారు. అయితే విశ్వనాథ్ తీసిన నాలుగైదు సినిమాల ఇన్ ఫ్లుయెన్స్ సతీష్ తీసిన 'కలవరమేయే మదిలో' చిత్రంపై కనిపిస్తుంది. అనాటి కళాఖండాలను గుర్తుచేసే ప్రయత్నం పొరపాటు కాదు. అయితే అలాంటి 'మిక్సింగ్'తో సినిమా తీసినంత మాత్రాన సరిపోదు. ఇవాల్టి యువతరం నాడిని ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే పనితనం, సన్నివేశాల బలం వంటివి అనివార్యం. వీటికి కనెక్టివిటీగా వినోదం అనేది కూడా తగిన మోతాదులో ఉండాలి. ఉదాహరణకు కథానాయిక హీరో మహేష్ వీరాభిమాని అనే పాయింట్ మీదే సినిమా మొత్తం నడిపి వినోదాల పంట పండించిన 'అష్టాచమ్మ'ను చెప్పుకోవచ్చు. అందులో కథానాయిక స్వాతి చేసిన అల్లరి సినిమాను విజయపథంలోకి తీసుకెళ్లింది. అదే స్వాతి ఇప్పుడు 'కలవరమాయే మదిలో' అన్నప్పుడు ప్రేక్షకులు కూడా ఆమె నుంచి అలాంటి స్పాంటేనియస్ అల్లరి, చిలిపిదనాన్నే ఆశించడం సహజం. ఆరంభంలో స్వాతి తనను తాను పరిచయం చేసుకుంటూ తన ఆశలు, ఆశయాలు గడగడా చెప్పేస్తుంటే...ఇంకేం...బోలెడంత ఎంటర్ టైన్ ఇందులోనూ ఉంటుందనే అభిప్రాయం కలుగుతుంది. కొంతసేపు అలాంటి నడకే నడిచినా ఆ తర్వాత స్వాతి ఒకదాని వెంట మరో కష్టాల కలవరంతో అల్లల్లాడుతుంది. ఆ కష్టాలు చూసి అనుకొన్నదొకటి..అయినది మరొకటి అనే 'కలవర' పాటు వీక్షకులకూ సో(పా)కుతుంది.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|