'ఏక్ నిరంజన్' రివ్యూ
చిన్నప్పుడే కిడ్నాప్ అయిన చింటూ తన తల్లిదండ్రులను ఎలా కలుసుకున్నాడనే పాయింట్ చుట్టూ పూరీ జగన్నాథ్ కథ రాసుకున్నారు.
అయితే ఆ పాయింట్ కంటే మంత్రి హత్య కేసు వ్యవహారంపైనే కథలో ఎక్కువ భాగం నడిచింది. చింటూ పక్కనే అతని తల్లిదండ్రులు తిరుగుతున్నట్టు చూపించినా వారి మధ్య వచ్చే సన్నివేశాల నుంచి కావాల్సినంత డ్రామా (సెంటిమెంట్ అనుకోవచ్చు) సృష్టించే అవకాశాన్ని కూడా పూరీ సద్వినియోగం చేసుకోలేదు. చిదంబరం చనిపోవడం వల్ల 'కలవని దిక్కులు కలవన్నట్టు' ముగింపు జనాలకు అర్ధమైపోతోంది. ఫీల్ మిస్సయినట్టే కదా. బ్యాంకాక్ ఏదో మన పక్కనే ఉన్నట్టు...ఒరేయ్ నవ్వకడే ఉండరా..వెంటనే వచ్చేస్తాను అని హీరోతో చెప్పించడం తమాషానే. పూరీ మార్క్ కామెడీ ఈసారి రివర్స్ అయింది. కథలో ఫోర్స్ వచ్చినప్పుడల్లా గ్రిప్పింగ్ కోసం కామెడీ ట్రాక్ నడపడం ఆయన స్టయిల్. ఇప్పుడూ అదే జరిగినా వినోదం మాత్రం వికటించింది.
ప్రభాస్ మరోసారి విజృంభించిన నటించి మాస్ హీరోగా తనకు తిరుగులేదనిపించుకున్నారు. అయితే జనం ఎంత ఆదరించినప్పటికీ స్టీరియో టైప్ డైలాగ్ (పట్టిపట్టి లాగండం) డెలవరీకి అలవాటు పడితే మొనాటనీ అవుతుంది. ఈ విషయంలో ప్రభాస్ జాగ్రత్తపడాలి. కంగనా రనౌత్ ముఖంలో అమాయకత్వం బాగా పండింది. మేకప్ కొన్ని సందర్భాల్లో తేలిపోయింది. పాటల్లో మినీ కాస్ట్యూమ్స్ తో గ్లామర్ చిందించింది. మరో రెండు మూడు తెలుగు సినిమాలు చేస్తేనే కానీ ప్రేక్షకులు రెగ్యులర్ హీరోయిన్ల ఖాతాలో వేసుకోరు. సోనూసూద్ విలనీ కామెడీ టచ్ తో ప్రేక్షకులకు ఎంటర్ టైన్ చేస్తుంది. ముఖ్యంగా సోనూసూద్-బ్రహ్మాజీ మధ్య వచ్చే సన్నివేశాలను జనం బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బ్రహ్మానందం-ఆలీ-అభినయశ్రీ మధ్య నడిచిన కామెడీ ట్రాక్...ఎవరికి వారు చక్కిలి గింతలు పెట్టుకుని నవ్వుకోవాల్సిందే. వల్గారిటీ పాళ్లు కూడా ఎక్కువే. మకరన్ దేశ్ పాండే, ముకుల్ దేవ్ లను బాలీవుడ్ నుంచి తెచ్చుకున్నా వారి పాత్రల్లో తగినంత బలం లేదు. నటనపరంగా ఫరవాలేదని మాత్రం అనిపించుకున్నారు. వేణుమాధవ్ పాత్రలోనూ కామెడీ కంటే పైత్యం పాళ్లు ఎక్కువ. సునీల్ మాత్రం ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించి తనదైన స్టయిల్ లో నవ్వించుకుంటూ వెళ్లిపోయాడు. పోసాని, తనికెళ్ల భరణి, సంగీత తదితరులు ఫరవాలేదు.
Read 4 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|