శ్రీనువైట్ల తన గత చిత్రాల తరహాలోనే 'వాయిస్ ఓవర్'తో కథా ప్రారంభం చేశారు. అయితే ఆయన చెప్పిన పాయింట్ లోని డెప్త్ కథలో అంతగా ఎక్స్ పోజ్ కాదు. వెంకట రమణ అలియాస్ వెంకీ (వెంకటేశ్) వృత్తి రీత్యా ఓ వెంట్రిలాక్విస్ట్. తన 'డ్రీమ్ గాళ్' కనిపించేంత వరకూ పెళ్లి చేసుకోరాదని ఎప్పటికప్పుడు పెళ్లి వాయిదా వేస్తుంటాయి. దీంతో వయసు ముదురుతుంది. ఓ జ్యోతిష్యుడ్ని (ఎంఎస్ నారాయణ) సంప్రదించినప్పుడు అతను గవ్వలు వేసి ఒక గవ్వ నిలబడటంతో నెవ్వెరపోతాడు. నెలరోజుల్లో పెళ్లి అయితే సరి..లేకుంటే పెళ్లి యోగం లేదని తేల్చిచెప్పేస్తాడు. ఈ క్రమంలోనే పారిస్ లో ఓ తెలుగు అసోసియేషన్ సెలబ్రేషన్స్ లో తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం వెంకీకి వస్తుంది. ఈవెంట్ ఆర్గనైజర్ పారిస్ ప్రసాద్ (బ్రహ్మానందం)ను కలుసుకుని మరికొంత మందితో కలిసి టూర్ కు బయలుదేరుతాడు. ఆ ట్రూప్ లో మాయ (త్రిష) వచ్చి చేరగానే తన డ్రీమ్ గాళ్ దొరికిందని వెంకీ సంబరపడిపోతాడు. ఆమెను సిన్సియర్ గా ప్రేమిస్తుంటాడు. పూజ మరెవరో కాదు. పారిస్ ప్రసాద్ బంధువే. వెంకీ పట్ల ఒకింత దుగ్ద ఉన్న పారిస్ ప్రసాద్ అతన్ని ఆట పట్టించాలని అనుకుంటాడు. ఈ ట్రిప్ సరదాగా గడవాలంటే వెంకీతో ప్రేమను నటించమని మాయకు చెప్పి ఒప్పిస్తాడు. పూజ తీరు చూసి ఆమె కూడా తనను ఇష్టపడుతోందని వెంకీ భావిస్తుంటాడు. ఓ దశలో వెంకీ సిన్సియర్ ప్రేమను చూసిన మాయ అతన్ని ఇంకా మాయ చేయడం మంచిది కాదని భావించి ఈ నాటకానికి తెరదించమని పారిస్ ప్రసాద్ కు చెప్పి అక్కడ్నించి రాయలసీమలోని తన ఇంటికి వచ్చేస్తుంది. ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన పూజ కుటుంబ సభ్యులు ఆమెకు వరుసకు బావ అయిన భద్రప్ప (సుబ్బరాజు)తో పెళ్లి నిశ్చయం చేస్తారు. అది ఇష్టంలేని పూజ ఇంటి నుంచి పారిపాయేందుకు విఫలయత్నం చేస్తుంది. తనను ఇంట్లోనో బంధించారనీ, విడిపించమనీ ఫోనులో ప్రసాద్ కు మాయ సమాచారం ఇస్తుంది. ప్రేమ కోసం వలలో పడిన పసివాడు తరహాలో వెంకీ ఆమెను దక్కించుకునేందుకు పారిస్ ప్రసాద్ తో కలిసి సీమ వెళ్తాడు. వెంకీది వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోయిందా? మాయను దక్కించుకున్నాడా? పారిస్ ప్రసాద్ నాటకానికి ఎలా తెరపడింది? అనేది మిగతా కథ.