'శంభో శివ శంభో' రివ్యూ
కర్ణ (రవితేజ), మల్లి (అల్లరి నరేష్), చందు (శివబాలాజీ) ప్రాణ స్నేహితులు. ఎవరి జీవితాశయాలు వారికి ఉంటాయి. కర్ణ తనను అమితంగా ప్రేమించే మరదలు మణెమ్మ (ప్రియమణి)ను పెళ్లాడాలనుకుంటాడు. అయితే మల్లి చేయి అందుకోవాలంటే అతనికి ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరని కాబోయే మామగారు (తనికెళ్ల భరణి) షరతు పెడతాడు. ఆ దిశగా కర్ణ ప్రయత్నాలు చేస్తుంటాడు. మల్లి విదేశాలకు వెళ్లిపోవాలనుకుంటాడు. ఎందుకు వెళ్లాలనుకున్నాడనే విషయంలో స్పష్టత లేనప్పటికీ (దర్శకుడు చెప్పలేదు) పాస్ పోర్ట్, వీసా కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. చందు బ్యాంకు రుణం తీసుకుని కంప్యూటర్ సెంటర్ పెట్టడం ద్వారా సెటిల్ కావాలనుకుంటాడు. కర్ణ చెల్లెలు పవిత్ర (అభినయ)ను కూడా ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. ఇలా సాగుతున్న ఈ మిత్రుల జీవితంలోకి ఓ కొత్త సమస్య వచ్చిపడుతుంది. మాజీ ఎంపి భవాని (రోజా) కొడుకైన సంతోష్ ఒకరోజు కర్ణ వద్దకు వస్తాడు. ఊహించని విధంగా ఒకరోజు అతను ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో మిత్రులంతా కలిసి కాపాడతారు. తాను ఓ ఫ్యాక్షనిస్టు (ముఖేష్ రుషి) కూతురు ప్రభను ప్రేమించాననీ, ఇది పెద్దలకు ఇష్టం లేదనీ అతను తన ప్రేమకథను వెల్లడిస్తాడు. ఆ ప్రేమజంటను కలపడం ప్రమాదంతో కూడుకున్నదే అయినా మిత్ర త్రయం అందుకు సిద్ధపడుతుంది. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి ప్రభను ఎత్తుకు వచ్చే ప్రయత్నంలో కర్ణ కంటిపై పొడవాటి కత్తి చీరుకుపోతుంది. మల్లిని ఒకడు పొడవాటి ట్యూబ్ తో కొట్టడంతో అతి చెవికి బలంగా తాకి వినికిడి శక్తి కోల్పోతాడు. చందు కాలిపై ఓ లారీ ఎక్కడంతో అది నుజ్జునుజ్జు అయిపోతుంది. సంతోష్, ప్రభకు పెళ్లి చేసి అజ్ఞాత ప్రదేశానికి కర్ణ పంపించేస్తాడు. మరోవైపు కర్ణ, అతని మిత్రులు పోలీసు కేసులో చిక్కుకోవడంతో తన కూతుర్ని కర్ణకు ఇచ్చి పెళ్లి చేసేందుకు మణెమ్మ తండ్రి ససేమిరా అంటాడు. మరోవైపు సంతోష్-ప్రభ జంట నాలుగురోజుల ముచ్చట తీరిన తర్వాత గొడవలు పడి విడాకలు వరకూ వెళ్తారు. ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయి మళ్లీ పెళ్లికి సిద్ధపడిపోతారు. దీంతో తమ త్యాగానికి విలువ లేకపోయిందని గ్రహించిన మిత్రత్రయం ఆ జంటకు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుందనే మిగతా కథ.
Read 2 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|