'మాయాబజార్' రివ్యూ
ఇక...పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన నటీనటుల గూర్తి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్ (శ్రీకృష్ణుడు), ఎ.ఎన్.ఆర్ (అభిమన్యుడు), సావిత్రి (శశిరేఖ), ఎస్.వి.రంగారావు (ఘటోత్కచుడు) అసమాన నటనా వైదుష్యాన్ని ప్రదర్శించారు. బలరాముడుగా గుమ్మడి, శకునిగా సి.ఎస్.ఆర్., దుర్యోధనుడుగా ముక్కామల, లక్ష్మణ కుమారుడుగా రేలంగి, రాక్షస మంత్రి చిన్నమయ్యగా రమణారెడ్డి, లంబు-జంబులుగా నల్ల రామ్మూర్తి, చదలవాడ, శాస్త్రి...శర్మలుగా అల్లు రామలింగయ్య, వంగర, దుశ్శాశనుడుగా ఆర్.నాగేశ్వరరావు, కర్ణుడుగా మిక్కిలినేని, రుక్మిణిగా సంధ్య, సుభద్రగా బుషేంద్రమణి, సాత్యకిగా నాగభుషణం, ఇంకా...'అంజి' బాలకృష్ణ, మాధవపెద్ది తమ నట ప్రతిభను చాటుకున్న వారే.
సాంకేతికపరంగానూ ఎవరికి ఎవరూ తక్కువ కాని ప్రతిభావంతులు ఈ చిత్రానికి పనిచేశారు. అలనాటి ద్వాపరయుగ వాతావరణాన్ని తలపించే సెట్స్, మినియోచర్స్ తో గోఖల్-కళాధర్, మేకప్ రూపశిల్పి పీతాంబరం, భక్త వత్సలం తీసుకన్న శ్రద్ధ శ్లాఘనీయం. ఇక మార్కస్ బార్ట్ లే ఫోటోగ్రఫీ...చేసిన ట్రిక్ షాట్స్ ఈ చిత్రానికి గుండెకాయ. 'లాహిరి లాహిరి లాహిరిలో' పాటలో నింగిలోని నిండుజాబిలిని నేలకు తీసుకువచ్చిన ఘట్టం అసామాన్యం. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటుల్లో లేని రోజుల్లోనే 'వివాహ భోజనంబు...'లో చేసిన మాయాజాలం ఆయన ఛాయాగ్రహణ ప్రతిభకు దర్పణం పడుతుంది. ఈ చిత్రానికి తొలుత ఎస్.రాజేశ్వరరావును సంగీత దర్శకునిగా తీసుకుని 'లాహిరి లాహిరి...', 'నీవేనా నను తలచినది', 'చూపులు కలిసిన శుభవేళ', 'నీ కోసమె నే జీవించునది' అనే నాలుగు యుగళ గీతాలను స్వరపరచారు. కారణాంతరాల వల్ల ఆయన స్థానే ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శకునిగా పనిచేయాల్సి వచ్చినట్టు చరిత్ర చెబుతుంది. ఘంటసాల మిగతా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చారు. ఇప్పుడు కలర్ లో ఆ పాటలు చూడటం ప్రేక్షకులకు వింత అనుభూతిని కలిగిస్తుంది.
Read 2 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|