'ఈనాడు' రివ్యూ
సామాన్య మానవుడు తిరగబడితే అణుబాంబు కంటే ప్రమాదం. జనం కోసం జనమే సృష్టించుకున్న వ్యవస్థ తీవ్రవాదం గుప్పిట్లో అల్లాడుతున్న పరిస్థితి ఈనాడు సగటు మనిషికి సవాలు విసురుతోంది. ఎప్పుడు ఎక్కడ ఏ ఆర్ డిఎక్స్ పేలుతుందో తెలియదు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వ్యక్తి సాయంత్రం ఇంటికి చేరుకుంటాడో లేడో తెలియని పరిస్థితి. తీవ్రవాదుల ఉన్మాదానికి ప్రాణం పోతోందని తెలియకుండానే పిట్టల్లా రాలిపోతున్న సామాన్యుడి బ్రతుకుకు ఏమాత్రం రక్షణ లేదు. సమాజానికి రక్షణ కవచంగా నిలిచే పోలీసులు ప్రాణాలకు తెగించి తీవ్రవాదులను పట్టుకుంటే వారిని రాజద్వారం గుండా బ్లాక్ మెయిలర్స్ విడిపించుకుపోతుంటే పార్లమెంటుపై దాడులు ఎందుకు జరగవు? గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ పేలుళ్లు, ముంబై దాడులు ఎందుకు పునరావృతం కావు? తీవ్రవాదం కోరల్లో చిక్కి పిట్టల్లా రాలిపోతున్న అమాయక జనాలకు జీవించే హక్కు లేనప్పుడు తీవ్రవాదులకు మాత్రం ఆ రైట్స్ ఎందుకు? తీవ్రవాదాన్ని అంతం చేసే ఆయుధం తీవ్రవాదమే కావాలి. ఇది ఓ సగటు మనిషి ఆత్మఘోష. అదే ఈనాటి 'ఈనాడు'. నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ వంటి మేటి నటులతో హిందీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుని సంచలన విజయం సాధించిన 'ఎ వెన్స్ డే' చిత్రానికి ఇది రీమేక్. మూలకథను డిస్ట్రబ్ చేయకుండా నేటివిటీకి దగ్గరగా ఉండేలా ఈ చిత్రాన్ని దర్శకుడు చక్రి తేలోటి తెలుగు ప్రేక్షకుల ముందుంచారు. ఇది దర్శకుడి తొలి ప్రయత్నమే అయినా చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నంగా చెప్పాలి. నసీర్, అనుపమ్ ఖేర్ లను గొప్ప నటులుగా చెబుతాం. అయితే ఆ పాత్రలను కమల్ హాసన్, వెంకటేష్ వంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు చేయడమంటే కచ్చితంగా అది 'కంటెంట్'లోని బలమే కారణం. కమల్ హాసన్ నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న గోల్డెన్ జూబ్లీ ఇయర్ కావడంతో పాటు...వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రానికి (తెలుగులో ఈ ఆనవాయితీ ఎప్పుడో తప్పింది) ఆయన తెరతీయడం మంచి పరిణామం.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|