'మగధీర' రివ్యూ
నాలుగువందల ఏళ్ల క్రితం తమ ప్రేమను పండించుకోలేని ఓ ప్రేమజంట తిరిగి ఈ జన్మలో అదే పోలికలతో జన్మించి ఒకరినొకరు కలుసుకుని తమ ప్రేమను గెలుపించుకుంటారు. టూకీగా ఇదే ఈ కథా సంగ్రహం. కొంచెం విస్తరిస్తే...కథా ప్రారంభం క్రీ.శ. 1609లో ప్రారంభమవుతుంది. ఉదయ్ గఢ్ సంస్థానాన్ని ఏలే రాజుకు (శరత్ బాబు) ఏకైక వారసురాలు మిత్రవింద (కాజల్). శతధ్రు వంశానికి చెందిన కాలభైరవ (రామ్ చరణ్) ఆ రాజ్య పరిరక్షకుడు. సైన్యాన్ని సుక్షితులుగా చేస్తూ కత్తి పడితే 100 మందిని చంపే వీరుడుగా ఖ్యాతి పొందుతాడు. యువరాణి, కాలభైరవ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అది మిత్రవింద బావ రణదేవ్ భల్లా (దేవ్ గిల్)కు నచ్చదు. యువరాణిపై మోజు పెంచుకుని ఆమె కోసం కాలభైరవ అడ్డుతొలగించుకువాలని కుట్రలు పన్నుతుంటాడు. సాహసంలో ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారికే యువరాణి దక్కుతుందని కాలభైరవతో సవాలు చేసి ఆ పోటీలో ఓడిపోతాడు. పోటీ నిబంధనల ప్రకారం కాలభైరవ అవమానభారంతో రాజ్య బహిష్కరణకు గురవుతాడు. పగబట్టిన అతను అరవీర భయంకరుడుగా ప్రపంచాన్ని జయించాలని బయలుదేరి
ఉదయ్ గడ్ పై దండెత్తిన షేర్ ఖాన్ (శ్రీహరి)తో చేతులు కలుపుతాడు. ఇరు పక్షాల యుద్ధంలో శతాధిక శత్రువులను చంపిన కాలభైరవ సాహసానికి షేర్ ఖాన్ సలాం చేస్తాడు. అయితే రణ్ దేవ్ కత్తిదూసి అప్పటికే తీవ్రగాయాలపాలైన కాలభైరవనూ, తనకు దక్కని ఏదీ ఇతరులకు దక్కరాదంటూ మిత్ర విందను హతం చేస్తాడు. కాలచక్రం గిర్రును తిరుగుతుంది. అలనాటి జన్మలో ప్రేమను పండించుకోలోకపోయిన కాలభైరవ హర్షగా, మిత్రవింద ఇందుగా, రణేదేవ్ రఘవీర్ గా, షేర్ ఖాన్ సాల్మన్ గా జన్మిస్తారు.
బైక్ రేసర్ అయిన హర్ష (చరణ్), కాలేజీ స్టూడెంట్ ఇందు (కాజల్) ఈ జన్మలోనూ ప్రేమించుకుంటారు. ఆస్తి చిక్కుల్లో ఉన్న ఉదయ్ గిరి కోటలోనే పట్టిన రఘువీర్ ఇప్పుడు కూడా ఈ జంట పాలిటి విలన్ గా అవమాతరమెత్తుతాడు. దీంతో హర్ష-ఇందు ప్రేమకు ఆటంకాలు మొదలవుతాయి. వీరంతా తమ పూర్వజన్మ సంగతులు ఎలా తెలుసుకుంటారు? చివరకు ప్రధాన జంట తమ ప్రేమను ఎలా గెలిపించకుందనేది మిగతా కథ.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3- -4- -5-
|